Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులను బీసీల్లో చేర్చటం చంద్రబాబుకే సాధ్యం: చినరాజప్ప

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:51 IST)
కాపులను బీసీ జాబితాలో చేర్చటం సీఎం చంద్రబాబుకే సాధ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏటా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూ సీఎం పారదర్శకత చాటుకుంటున్నారని అన్నారు. సీఎంపై అనవసర విమర్శలతో కాపులకు అన్యాయం చేయటం తగదన్నారు. 
 
'2 ఎకరాల భూమి స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్లు సంపాదించిన కిటుకేదో చెబుతారా?' అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెల్సిందే.  
 
దీనిపై ఆయన స్పందించారు. సీఎం ఆస్తులపై ముద్రగడ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ముద్రగడ వెంటనే దీక్ష విరమించాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ కోరారు. కాపులకు మేలు చేయాలనుకుంటే ముద్రగడ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.
 
అందరు రాజకీయ నేతలకు భిన్నంగా చంద్రబాబు ఏటా తన ఆస్తులనే కాక తన కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఏ ఒక్కరూ అడగకున్నా తనకు తానుగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నా, చంద్రబాబుకు రూ.2 లక్షల కోట్ల ఆస్తులున్నాయని చెప్పడం మీకు తగునా? అని ముద్రగడను చినరాజప్ప ప్రశ్నించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments