Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే రిజైన్ చేయాలి : హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌పై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఒకింత కన్నెర్రజేసింది. 
 
ఏపీ హైకోర్టు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీనిపై బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. ఆ తర్వాత పిటిషనరు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ వెంకటరాజు అదృశ్యం కేసులో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
అంతేకాకుండా, గతంలో పలుమార్లు డీడీపీని కోర్టుకు పిలిపించినా ఏమాత్రం మార్పు రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు కన్నెర్రజేసింది. పనిలోపనిగా, ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments