జగన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. త్వరలో లండన్ టూర్

ఠాగూర్
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:32 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన పాస్ పోర్టును ఐదేళ్లకాలపరిమితితో పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో జగన్ దంపతులు తలపెట్టిన లండన్ పర్యటనకు ఉన్న పాస్ పోర్ట్ అడ్డంకులు తొలగిపోయాయి. 
 
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉండేది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నిబంధనల మేరకు ఆయన డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దు కావడంతో సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఐదేళ్ల కాలపరిమితితో జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. కానీ, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్టు కాలపరిమితిని ఒక యేడాదికి మాత్రమే కుదిస్తూ, పలు షరతులు విధించింది. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్ల గడువుతో జగన్‌కు పాస్ పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments