Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (19:03 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారుచేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిగింది. ఆనందయ్య చేసుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. అయితే, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
ఈ క్రమంలో దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు.. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందరు మరణించారని నిలదీసింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments