Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (19:03 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారుచేసిన కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిగింది. ఆనందయ్య చేసుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. అయితే, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
ఈ క్రమంలో దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు.. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందరు మరణించారని నిలదీసింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య దరఖాస్తును పరిశీలించాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments