స్థానిక ఎన్నికలపై జగన్ సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:51 IST)
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రతులు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వద్దకు పంపాలని ఆదేశించింది. 
 
ఇందులో ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలిసి స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని విడమర్చి చెప్పాలని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎస్ఈసీకి తెలపాలని వివరించింది. అందుకు, మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా మూడ్రోజులు గడువు విధిస్తున్నట్టు న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టంచేసింది. 
 
అంతేకాదు, త్వరలోనే ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో ప్రభుత్వానికి వివరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, ఈ చర్చలకు వేదికను ఎన్నికల సంఘం నిర్ణయించాలని సూచించింది. 
 
కాగా, గత మార్చి నెలలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇపుడు ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments