Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక ఎన్నికలపై జగన్ సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:51 IST)
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రతులు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వద్దకు పంపాలని ఆదేశించింది. 
 
ఇందులో ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలిసి స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని విడమర్చి చెప్పాలని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎస్ఈసీకి తెలపాలని వివరించింది. అందుకు, మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా మూడ్రోజులు గడువు విధిస్తున్నట్టు న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టంచేసింది. 
 
అంతేకాదు, త్వరలోనే ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో ప్రభుత్వానికి వివరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, ఈ చర్చలకు వేదికను ఎన్నికల సంఘం నిర్ణయించాలని సూచించింది. 
 
కాగా, గత మార్చి నెలలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇపుడు ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments