Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు భారీ ఊరట...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:09 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. ఈ కేసులో గత ఐదేళ్ళుగా కోడికత్తి శ్రీను జైలులో మగ్గిపోతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గత నెల 24వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ తీర్పును గురువారం ప్రకటించింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని, రూ.25 వేల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో హజరై సంతకం చేయాలని, ర్యాలీల్లో పాల్గొనరాదని తదితర షరతులు విధించింది. కాగా, హైకోర్టు తీర్పుపై దళిత, పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే, ఈ కేసులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఆయన సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాకపోవడంతో కోడికత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments