Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు...

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:42 IST)
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. దీంతో సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం అత్యవసరంగా విచారించింది. విచారణ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్టును తొలగించి, బ్లాక్ చేశారని చెప్పారు. తాము కూడా లేఖ రాశామని సీబీఐ తెలిపింది. 
 
దీంతో ధర్మాసనం స్పందిస్తూ లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. పంచ్ ప్రభాకర్‍‌‌ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని వ్యాఖ్యానించింది. సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చెప్పింది వినకపోతే... మీరు చెప్పేది కూడా మేము వినబోమని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
పైగా, ఈ కేసులో ఏం చేయాలో తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పైగా, ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం సాయంత్రాకల్లా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments