Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు...

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (15:42 IST)
కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. దీంతో సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం అత్యవసరంగా విచారించింది. విచారణ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్టును తొలగించి, బ్లాక్ చేశారని చెప్పారు. తాము కూడా లేఖ రాశామని సీబీఐ తెలిపింది. 
 
దీంతో ధర్మాసనం స్పందిస్తూ లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. పంచ్ ప్రభాకర్‍‌‌ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని వ్యాఖ్యానించింది. సీబీఐ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చెప్పింది వినకపోతే... మీరు చెప్పేది కూడా మేము వినబోమని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
పైగా, ఈ కేసులో ఏం చేయాలో తామే ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పైగా, ఈ కేసును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం సాయంత్రాకల్లా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments