స్కిల్ కేసులో ఏఏజీ గైర్హాజరు... చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (13:25 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదాపడింది. శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు ఏఏజీ హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేసింది. 
 
ప్రస్తుతం ఆయనకు ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై తన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదే కేసులో ఆయన పూర్తి స్థాయి బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సివుండగా, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. ఏఏజీ నేడు విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. 
 
తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments