Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 9 ప్రధాన డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చేనెల రెండో తేదీ అంటే గాంధీ జయంతి రోజు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, గ్రామ పంచాయతీ ఉద్యోగుల కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుంది. 
 
అలాగే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్‌లకు కనీస వేతనం ఇవ్వాలని కోరింది. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లించాల్సిన డిమాండ్ చేసింది. నెలకు రూ.6 వేలు చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరింది. 
 
ముఖ్యంగా, పంచాయతీ కార్మికలను తొలగించడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించాలని ఉద్యోగుల సంఘం కోరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments