Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత?

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (17:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే రాత్రిపూట అమలు చేస్తూవచ్చిన కర్ఫ్యూను ఎత్తివేసింది. ఇపుడు అమరావతిలోని సచివాలయంలో అమలు చేస్తూ వచ్చిన కరోనా ఆంక్షలను కూడా తొలగించింది. 
 
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఇపుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మునుపటితో పోల్చితే కరోనా ఉధృతి బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. 
 
సచివాలయంలో కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశఆరు. ఐఏఎస్ అధికారులకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments