Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకుస్థాపనకు బాబా రాందేవ్‌ను పిలిచారు సరే... జగన్‌ను పిలిచారా...?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (20:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే రాందేవ్ బాబా చంద్రబాబు పాలన భేష్ అని కితాబిచ్చారు. ఇకపోతే ఇప్పటి ఆధునిక జీవనశైలికి యోగ, ధ్యానం ఎంతో ముఖ్యమనీ, అందువల్ల రాందేవ్ బాబాతో కలిసి తిరుపతిలో యోగ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు కామినేని.
 
ఇదిలావుంటే శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారా లేదా అనేది సస్పెన్సుగా ఉంది. దీనిపై మంత్రి నారాయణను అడిగినప్పుడు అందరూ ఆహ్వానితులే.. అంటే జగన్ మోహన్ రెడ్డిగారు కూడా ఆహ్వానితులే అని సమాధానమిచ్చారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది కూడా సస్పెన్సుగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకోవడంపై ఆయన ధర్నాలు చేశారు. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి రాకపోవచ్చనే వాదనలు వినబడుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments