Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్లకు షాక్ : సాక్షి పత్రిక కొనుగోలు అలవెన్స్‌ను రద్దు చేసిన ఏపీ సర్కారు!

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (09:15 IST)
గత వైకాపా ప్రభుత్వం వాలంటీర్లు విధిగా సాక్షి దినపత్రికను కొనుగోలు చేయాలన్న నిబంధనతో ఇందుకోసం నెలకు రూ.200 చొప్పున అలవెన్స్ ఇచ్చేలా జారీ చేసిన జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కావడంతో, నాటి ప్రభుత్వ అధికారులు కూడా సీఎం జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డిల మెప్పు కోసం ఈ అడ్డగోలు నిర్ణయం తీసుకుని, ప్రతి నెల వాలంటీర్లకు రూ.200 చొప్పున అలవెన్సులు చెల్లిస్తూ వచ్చారు. 
 
అయితే ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఆ అలవెన్సును రద్దు చేసింది. పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా మెమో జారీ చేసింది. పత్రిక కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది. సాక్షి పత్రిక సర్క్యులేష్‌ను పెంచుకునేందుకు అప్పట్లో వైకాపా పాలకుల ఆదేశాలను అధికారులు శిరసావహించారు. ఇపుడు ప్రభుత్వం మారడంతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. 
 
మరోవైపు, ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైకాపా నేతలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments