Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో 7, 8 తేదీల్లో సెలవులు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి కారణం ఈ నెల 8వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండటమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. 
 
ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా పేర్కొంది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండ్రోజులు ముందుగానే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
 
మరోవైపు, ఈ ఎన్నికలను వాయిదావేయాలని కోరుతూ జనసేన, బీజేపీలతో పాటు.. తెలుగుదేశం పార్టీల హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే వాదనలు పూర్తికాగా, మంగళవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments