Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో 7, 8 తేదీల్లో సెలవులు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి కారణం ఈ నెల 8వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండటమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. 
 
ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా పేర్కొంది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండ్రోజులు ముందుగానే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
 
మరోవైపు, ఈ ఎన్నికలను వాయిదావేయాలని కోరుతూ జనసేన, బీజేపీలతో పాటు.. తెలుగుదేశం పార్టీల హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే వాదనలు పూర్తికాగా, మంగళవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments