Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:46 IST)
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ, భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ వేళ, మోదీ సమర్ధ నాయకత్వంతో  కీలక రంగాలలో అభివృద్ధి పతాక స్దాయికి చేరుకుందన్నారు.
 
చైతన్యవంతమైన నాయకత్వం అందిస్తున్న నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యపడుతుందన్నారు.  అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ మెరుగుపడిందంటే అది ప్రధాని పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్షును పొంది, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఫలవంతమైన జీవితాన్ని పొందాలని తాను కోరుకుంటున్నానన్నారు. 
 
నరేంద్ర మోదీ తన నిర్ణయాత్మక పాత్రతో భరతజాతిని మరింత ఉన్నత స్ధితికి తీసుకెళ్లాలని పూరి జగన్నాథ స్వామి, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రధానికి సందేశం పంపారు. ఈ క్రమంలో శుక్రవారం రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments