Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త - జనవరి ఒకటి నుంచి రూ.750 పెంపు

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి ఒకటో తేదీ నుంచి వేతనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా మరో రూ.750 కలిపి అందజేస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుకంగా ఈ ప్రకటన చేశారు.
 
ఆయన గురువారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌ కానుకగా వాలంటీర్లకు జీతం అదనంగా రూ.750 పెంచుతున్నట్టు చెప్పారు. పెంచిన వేతనాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అందుకుంటారు తెలిపారు. పనిలోపనిగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. 
 
వారిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో సుభిక్షంగా కొనసాగుతుందని, దీన్ని ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోమారు ముఖ్యమంత్రి ఖావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments