Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తెచ్చి పంచడమే ప్రభుత్వ పనా? : ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్న

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణులతో పాటు... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారయిందని... పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితిని మనం చూస్తున్నామన్నారు. 
 
ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలన్నారు. సామర్థ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... వీటన్నింటిని ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పులు తీసుకురావడం... వాటిని పంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసే పని అప్పులు తెచ్చి పంచడమేనా? అని ప్రశ్నించారు. ఎంతకాలం అప్పులు పుడతాయని అడిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments