Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ సమాజం భూమల అక్రమాలలో శాంతిపై ఆరోపణలు: దేవాదాయ మంత్రి ఆనం

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (21:09 IST)
విశాఖపట్టణంలోని ప్రేమ సమాజం భూముల అక్రమాల వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఆరోపణలు ఉన్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చేస్తూ, దేవాదాయ శాఖలో శాంతి ఉద్యోగ నియామకంపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. అపుడు పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలోనే ఉన్నారని గుర్తుచేశారు. శాంతి నియామకంపై తప్పు జరిగితే పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా బాధ్యులేనని స్పష్టం చేశారు. దీనిపై ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరుతామన్నారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో పని చేసినపుడు శాంతిపై పలు విమర్శలు వచ్చాయని, ముఖ్యంగా ప్రేమ సమాజం భూముల విషయంలో శాంతిపై ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖ భూ అక్రమాల్లో శాంతితో పాటు న్యాయవాది సుభాష్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని మంత్రి ఆనం తెలిపారు. 
 
అమ్మతోడు.. శాంతి ఇంటికి వస్తే ఆశీర్వదించి పంపాను : సాయిరెడ్డి 
 
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఆమె తనకు కుమార్తెతో సమానమని తెలిపారు. తన ఇంటికి వస్తే ఆశీర్వదించి పంపించానని, అంతకుమించి ఏమీ లేదని జగన్‌కు సాయిరెడ్డి తెలిపారు. 
 
ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైకాపా నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్, విజయసాయిరెడ్డిల మధ్య అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశంపై పెద్ద చర్చే జరిగింది. అసలేం జరిగింది. ఏమిటీ చర్చ.. మీడియాలో ఎందుకింత రాద్దాం జరుగుతుంది అని సాయిరెడ్డిని జగన్ నిలదీసారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు వీరిమధ్య చర్చ జరగ్గా.. సాయిరెడ్డి తన వైపు నుంచి వివరణ ఇచ్చారు. 
 
"కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2020లో అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఎండోమెంట్స్ విభాగంలో  సీతమ్మదార కార్యాలయంలో కలిశాను. అప్పటి నుంచి ఆమెకు కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినపుడల్లా సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి చూశాను. మాట్లాడాను. నా ఇంటికి వచ్చినపుడు ఆశీర్వదించాను. అంతే.. ఇంతకుమించి ఏమీ లేదు" అని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై జగన్ స్పందన ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల మేరకు.. సాయిరెడ్డికి జగన్ గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments