Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెలకు గుండెపోటు వస్తే.. బసవతారకం ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు..?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:33 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఎవరు దొంగతనం చేయమన్నారు.. ఆత్మహత్య ఎవరు చేసుకోమన్నారు అంటూ ప్రశ్నించారు. కోడెల మృతి బాధాకరం అంటూనే.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ స్పీకర్ ప్రాణాలు కోల్పోతే ఉపముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 
 
మరోవైపు కోడెల శివప్రసాదరావు మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని అయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తొలుత గుండెపోటు అన్నారని, ఆ తరువాత ఆత్మహత్య అంటున్నారని.. కోడెల మృతిపట్ల సమగ్ర విచారణ అవసరమని బొత్స పేర్కొన్నారు. 
 
కోడెలకు ఒకవేళ గుండెపోటు వచ్చి ఉంటే నిమ్స్, కేర్ ఆస్పత్రి, అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కానీ బసవతారకం హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అది క్యాన్సర్ హాస్పిటల్ కదా ? అంటూ ఆయన అడిగారు. ప్రభుత్వం కేసులతో కోడెల శివప్రసాద్ రావును వేధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం కరెక్టు కాదని బొత్త అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments