Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (13:16 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప్-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలివరకు తెచ్చారంటూ వ్యాఖ్యానించారు. 
 
సోమవారం మంగళవారం తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు.
 
'తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి డైనమిక్ నేత. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్‌షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్‌ ధర పెంపు అవకాశమిచ్చారు. అల్లు అర్జున్‌ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు. 
 
థియేటర్‌ స్టాఫ్‌ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. సీట్లో ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆ అరుపుల్లో ఆయనకు వినిపించలేదేమో. అల్లు అర్జున్‌ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు' అని పవన్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments