Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ హత్యకు కుట్రపన్నిన ఆ ముగ్గురు? డీజీపీ ఏమంటున్నారు

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు ముగ్గురు కుట్ర పన్నినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించే

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (11:17 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు ముగ్గురు కుట్ర పన్నినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ఒక్క పవన్ కళ్యాణ్‌కు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో సీఎం నుంచి సామాన్యుని వరకూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రక్షణ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌పై హత్యకు కుట్ర పన్నిన ఆ ముగ్గురి వ్యక్తుల గురించి ఆధారాలు అందజేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నిమిషం కూడా వెనుకాడబోమని భరోసా ఇచ్చారు. 
 
ఇకపోతే, పోలీసులకు ఐపీసీ, సీఆర్‌పీసీ తప్ప రాజకీయ పార్టీల గురించి అవసరం లేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే పశ్చిమ గోదావరి ఎస్పీకి సమాచారం అందించామన్నారు. పవన్‌ కల్యాణ్‌ వద్ద ఆధారాలు తీసుకొని చట్టపరమైన చర్యలు చేపట్టేపనిలో ఆయన ఇప్పటికే నిమగ్నమై ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments