Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కీలక పరిణామం : సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి!

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయనను సాధారణ సెలవుపై వెళ్ళాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. నిజానికి ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సివుంది. అయితే, ఇపుడు ఆయన సెలవుపై వెళ్లడం గమనార్హం. పైగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. అలాగే, గురువారం సాయంత్రంలోగా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడ సెలవుపై వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, ఇప్పటివరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైకాపా ఓటమి తర్వాత ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments