ఏపీలో కీలక పరిణామం : సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి!

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయనను సాధారణ సెలవుపై వెళ్ళాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. నిజానికి ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సివుంది. అయితే, ఇపుడు ఆయన సెలవుపై వెళ్లడం గమనార్హం. పైగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. అలాగే, గురువారం సాయంత్రంలోగా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడ సెలవుపై వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, ఇప్పటివరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైకాపా ఓటమి తర్వాత ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments