ప్రచారం పిచ్చి పీక్‌కు చేరింది.. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ జగన్ ప్రచార వీడియోలు

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (09:06 IST)
ఏపీలోని అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పిచ్చి తారాస్థాయికి చేరింది. కనిపించిన ప్రతి చోటును, ప్రతి ప్రాంతాన్ని తన ప్రచారం కోసం వైకాపా నేతలు వినియోగించుకుంటున్నారు. ఇపుడు చివరకు బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ ఎన్నికల ప్రచార వీడియోలు ప్రసారం చేస్తున్నారు. ఈ తరహా వీడియోలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగు చూశాయి. 
 
బైజూస్‌ కంటెంట్‌ కాకుండా పిల్లలు అదనంగా నేర్చుకునేందుకంటూ ట్యాబ్‌ల్లో స్విప్ట్‌చాట్‌ యాప్‌ను వేశారు. దీన్ని ఓపెన్‌ చేస్తే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వస్తున్నాయి. విద్యార్థులు వైఫైతో కనెక్ట్‌ అయి, యాప్‌ను ఓపెన్‌ చేయగానే జగన్‌ ప్రచార వీడియోలు వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. సాధారణంగా ప్రకటన వస్తే దాన్ని వద్దనుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీంట్లో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ సైతం వస్తోంది. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8 తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్‌ల్లో స్విప్ట్‌చాట్‌లాంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసి, ఇచ్చారు. పాఠ్యాంశాలు తప్ప మరేవీ యాప్‌లో ఓపెన్‌ కాకుండా లాక్‌ చేశామని అధికారులు ఇంతకాలం చెబుతూ వస్తున్నారు. అలాంటప్పుడు స్విప్ట్‌చాట్‌ యాప్‌ను ఓపెన్‌ చేస్తే వైకాపా ప్రచార వీడియోలు ఎలా వస్తున్నాయి? ప్రభుత్వమే కావాలని పంపిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్విప్ట్‌చాట్‌ యాప్‌ ద్వారా కొందరు యూట్యూబ్‌లో సినిమాలూ చూస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments