Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది ఉద్యోగుల ప్రభుత్వం.. మీరు లేకపోతే నేను లేను : ఏపీ సీఎం జగన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:25 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరో తేదీ అర్థరాత్రి నుంచి చేపట్టాలని భావించిన సమ్మెను ఉపసంహరించుకున్నాయి. శనివారం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటి, ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలు ఫలించడంతో నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా ఆదివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం. ఉద్యోగులు లేకపోతే నేను లేను. పీఆర్సీ విషయంలో ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని కోరారు. 
 
తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని, ఉద్యోగులు లేకపోతే తాను లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతానని చెప్పారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన పునరుద్ఘాటించారు. 
 
కరోనా కష్టకాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో చేయలేకపోయామని, కానీ, చేయగలిగినంత చేశామని చెప్పారు. కానీ భవిష్యత్తులో ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అని అనిపించుకుంటానని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments