కారంచేడు వైద్యుడికి సీఎం జగన్ రూ.కోటి ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (16:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ వైద్యుడిపై కరుణ చూపారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ప్రభుత్వ డాక్టర్ భాస్కరరావు చికిత్స కోసం రూ.కోటి సాయం అందించారు. ఇందుకుగాను ఆయన కుటుంబసభ్యులు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
 
ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు చికిత్సకు రూ.కోటి నిధులు అందజేశారు. కరోనా రోగులకు వైద్యం అందజే అదే మహమ్మారికి చిక్కిన భాస్కరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనందున తక్షణం వాటిని మార్చాలని డాక్టర్లు సూచించారు. ఇందుకోసం ఏకంగా రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు ఈ నేపథ్యంలో వైద్యుడి బంధువులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. 
 
దీంతో ఆయన శుక్రవారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం... భాస్కరరావు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రూ.కోటి విడుదల చేయించారు. అవసరమైతే మిగిలిన రూ.50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బాలినేని వారికి తెలిపారు. దీంతో భాస్కరరావు కుటుంబసభ్యులు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments