Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంవో నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఔట్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వాధికారిగా పెత్తనం చెలాయిస్తూ వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. ఆయన్ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనరుగా బాధ్యతలు అప్పగించింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను రాష్ట్ర  నుంచి బయటకు గంటేశారని చెప్పొచ్చు. 
 
గత కొంతకాలంగా ప్రవీణ్ ప్రకాష్‌పై సీఎం గుర్రుగా ఉంటున్నారు. పైగా, సీఎంవో ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన బాధ్యతలను మరో ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి అప్పగించారు. ఈ క్రమంలో తాజా ప్రవీణ్ ప్రకాష్‌పై బదిలీపేరుతో సీఎంవోలో లేకుండా చేశారు. 
 
ఇటు సీఎంవో, ఓటు జేఏడీ పొటికిలక్ సెక్రటరీగా ప్రభుత్వంలోని అతి కీలకమైన అధికారాలన్నీ తన గుప్పెట పెట్టుకున్న ప్రవీణ్ ప్రకాష్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం డమ్మీ చేశారన్న అభిప్రాయం చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో నెలకొంది. 
 
ముఖ్యంగా, సీఎంగా నీలం సాహ్ని ఉన్న సమయంలో ఇది కనిపించింది. పైగా, ప్రవీణ్ ప్రకాష్ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం జగన్ ఆయన్ను పక్కనపెట్టేశారు. ఇపుడు ఏకంగా రాష్ట్రం నుంచి పంపించి వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments