Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై సింగపూర్ ప్రణాళిక.. మార్పులు చేసిన చంద్రబాబు!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయాలని సింగపూర్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సూచించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా రాజధానిపై ప్రణాళిక సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. 
 
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన వెంట వెళ్లిన బృందానికి నూతన రాజధాని ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం వివరించింది. ఈ సమావేశానికి సింగపూర్ మంత్రులు, ప్రధాన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. 
 
చంద్రబాబు సూచించిన మార్పులతో మరోసారి ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం రూపొందించబోతోంది. మరో 4 లేదా 6 వారాల్లో రాజధాని ప్రణాళికపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రహదారులు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం సింగపూర్ ప్రధానితో చంద్రబాబు సమావేశం కానున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments