Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో కృష్ణ పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (12:45 IST)
వృద్దాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
అక్కడ పద్మాలయ స్టూడియోస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచిన సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో మహేష్ బాబును సీఎం జగన్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేసి భారీ భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments