Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు అమరావతి శంకుస్థాపన ఇన్విటేషన్ : చంద్రబాబే ఇస్తారా?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (13:19 IST)
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేయనున్నారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఏవిధంగా అయితే, ఆహ్వాన లేఖలు పంపనున్నారో అదేవిధంగా కేసీఆర్‌కు కూడా ఆహ్వాన పత్రికను పంపాలని తొలుత భావించారు. అయితే, కేసీఆర్, చంద్రబాబు నాయుడులు హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల నేరుగా ఇవ్వడమే సముచితమని భావిస్తున్నారు. 
 
కాగా, దసరా పండుగ రోజున నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్ష మందిని ఆహ్వానించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో  బద్దశత్రవుగా మారిన కేసీఆర్‌కు బాబు ఆహ్వానం పంపుతారా లేదా అనేదే ఇపుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. 
 
దీనికి కారణం లేకపోలేదు. గతంలో గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఒకరితో ఒకరు కలవకుండా డుమ్మా కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వైఖరి ఎలా ఉండబోతుంది? ఆహ్వానం వస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారనేదానిపైనే సర్వత్రా చర్చ జరిగింది. అందరి సీఎంలతో  పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం ఆహ్వాన పత్రికను పంపాలని భావించినప్పటికీ... చంద్రబాబు మాత్రం స్వయంగా వెళ్లి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments