Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్‌లను వదిలిపెట్టం : ముంబై నటి కేసులో సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (12:34 IST)
ముంబై నటి కాదంబరి జైత్వానీ కిడ్నాప్, వేధింపులు కేసులో రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు నడుచుకున్న ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని మండిపడ్డారు. హీరోయిన్, ఆమె కుటుంబానికి వేధింపుల విషయంలో ప్రమేయం ఉన్న పోలీసులు అధికారులు ఏ హోదాలో ఉన్నా క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం నాడు మీడియాతో చిట్చాట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే, గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై కూడా ఆయన స్పందిస్తూ, విద్యార్థులు అందరి సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేపట్టామని, ఎలాంటి పరికరాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రచారాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రచారం పట్ల విద్యార్థులు అందరూ భయాందోళనలకు గురయ్యారని, సమాచారం తెలిసిన వెంటనే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చంద్రబాబు వివరించారు. నేరానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments