Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్‌లను వదిలిపెట్టం : ముంబై నటి కేసులో సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (12:34 IST)
ముంబై నటి కాదంబరి జైత్వానీ కిడ్నాప్, వేధింపులు కేసులో రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు నడుచుకున్న ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని మండిపడ్డారు. హీరోయిన్, ఆమె కుటుంబానికి వేధింపుల విషయంలో ప్రమేయం ఉన్న పోలీసులు అధికారులు ఏ హోదాలో ఉన్నా క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం నాడు మీడియాతో చిట్చాట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే, గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై కూడా ఆయన స్పందిస్తూ, విద్యార్థులు అందరి సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేపట్టామని, ఎలాంటి పరికరాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రచారాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రచారం పట్ల విద్యార్థులు అందరూ భయాందోళనలకు గురయ్యారని, సమాచారం తెలిసిన వెంటనే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చంద్రబాబు వివరించారు. నేరానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments