Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:17 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నవ్యాంధ్రకు పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌‍లోని జ్యూరిచ్‌ నగరంలో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్ ప్రసంగిస్తూ, భవిష్యత్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు కాదన్నా ఇది జరిగితీరుతుందన్న కోణంలో వ్యాఖ్యానించారు. 
 
ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ మాటలు విని ఆగ్రహోద్రుక్తుడయ్యారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు.. మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి.. అసందర్భం ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments