Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధిత ప్రాంతాల్లోని వాహనదారులకు శుభవార్త!!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఉన్న వాహనదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ శుభవార్త చెప్పారు. వరదలో మునిగిన వాహనాల మరమ్మతు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు, బీమా కంపెనీల మేనేజర్లు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో వాహనదారుల క్లెయింలను వేగంగా పరిష్కరించాలని, మరమ్మతుల భారం తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే సర్వం కోల్పోయిన వరద బాధితలకు వాహనాల మరమ్మతులు పెనుభారంగా మారకుండా చూడాలని కోరారు. మరమ్మతుల ఖర్చులు తగ్గేలా చూడాలని కోరారు. నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని  కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు. నిబంధనలు, కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, బీమా కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments