Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పతనానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ : చంద్రబాబు జోస్యం

ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు.

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (04:50 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
 
గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో తొలుత మాట్లాడింది టీడీపీయే. ఇప్పుడు బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ కూడా కమలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మాటలు చాలు, పని మొదలుపెట్టండనే సంకేతాన్ని ప్రజలు మోడీకి ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిట్టింగ్‌ స్థానాలను కూడా కాపాడుకోలేకపోవడం... మోడీకి తగ్గిన ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ పతనానికి పునాది వేసింది మనమే అని మంత్రులతో వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments