ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...

అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారుల

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ విషయాన్ని చేరవేశారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మాయనిమచ్చని, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.
 
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. డుంబ్రీగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద బసులో వెళుతున్న కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. నిజానికి మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments