Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు.. సీఎం చంద్రబాబు అసహనం

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (12:54 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు. ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బతింటోంది. మంత్రులు జాగ్రత్తగా ఉండాలి. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులు గైడ్‌ చేయాలి. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అంటూ వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్రం గత ఐదేళ్లలో అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. ఇపుడు ఇటుక ఇటుక పేర్చుకుని నిర్మాణం మొదలుపెడితే కొందరు ఎమ్మెలు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారా చెబుతోందన్నారు. 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్‌ విడుదల చేయడం సంతోషమన్నారు. పైపెచ్చు.. పోలవరానికి రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments