Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బీకాం డిగ్రీ పూర్తిచేయలేదా?

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (17:57 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లోపడ్డారు. ఈయన బీకాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొంటూ ఆయనపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అశోక్ బాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో అవాస్తవాలు పేర్కొన్నారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించిన విషయం తెల్సిందే. 
 
దీంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు అశోక్ బాబుపై ఐపీసీ 477, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన బీకాం డిగ్రీ పూర్తిచేయకుండానే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని అభియోగాలు నమోదు చేశారు. 
 
డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. పైగా, ఈయన సర్వీసు రికార్డులను కూడా తారుమారు చేశారన్న ఆరోపణలపై కూడా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments