Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బీకాం డిగ్రీ పూర్తిచేయలేదా?

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (17:57 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లోపడ్డారు. ఈయన బీకాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొంటూ ఆయనపై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అశోక్ బాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో అవాస్తవాలు పేర్కొన్నారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించిన విషయం తెల్సిందే. 
 
దీంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు అశోక్ బాబుపై ఐపీసీ 477, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన బీకాం డిగ్రీ పూర్తిచేయకుండానే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని అభియోగాలు నమోదు చేశారు. 
 
డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. పైగా, ఈయన సర్వీసు రికార్డులను కూడా తారుమారు చేశారన్న ఆరోపణలపై కూడా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments