Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు కేసీఆర్‌‍ను బూతులు తిట్టి... నేడు అదే తప్పు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు.

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:29 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని తేలిపోయింది. నలుగురికి నీతులు చెప్పే చంద్రబాబు.. చివరకు ఆ నీతికి, నైతిక విలువలకు కట్టుబడేందుకు ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోనే కాడుండా వ్యక్తిగతంగా కూడా విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాజాగా ఆ విలువలకు తిలోదకాలిచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తీసుకున్నారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే అంశంపై టీ టీడీపీ న్యాయపోరాటం కూడా చేస్తోంది. ఇపుడు ఇదే తప్పు చంద్రబాబు చేశారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన వారిలో నలుగురు జంప్ జిలానీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. 
 
తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో అప్పట్లో గవర్నర్‌పైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు, పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా, ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ - 'దేవర' పాట రిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments