Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (13:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, రాజధాని అమరావతి ప్రాంతంలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలను నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే, మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. భవనాలు, లేఔట్‌ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించాలని కేబినెట్ తీర్మానించింది. 
 
రాజధాని అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఔట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 
 
ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్త 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
అలాగే, తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌లో రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, ఎస్.ఐ.పి.బీ ఆమోదించిన 182162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments