Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం కూడా ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్నాం : బీజేపీ ఎంపీ హరిబాబు

తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిప

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (09:17 IST)
తాము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో దానికి సమానమైన నిధులను ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని ఆయన వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ద్వారా ఏపీకి లభించాల్సిన ప్రతిఫలం విషయాల గురించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో.. ఏపీ ఆర్థికమంత్రి యనమల, కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎంపీలు, అధికారులు మాట్లాడటం జరిగింది. 
 
ప్రధానంగా ఆర్థిక లోటు భర్తీ, ఇప్పటివరకూ ఇచ్చిన నాలుగువేల కోట్లకు అదనంగా ఎంత రాష్ట్రానికి రావాలి. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కేంద్రం అందించే విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలల్లో.. ప్రత్యేక హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి. హోదా లేకపోతే 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలన్నారు. 
 
ప్రత్యేక ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే విధంగా నిర్ణయిస్తామని జైట్లీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ 60, 90 శాతానికి మధ్య ఉన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి, ఈ నిధులన్నింటీని ఏపీకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments