Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ భాజపా నేతల భేటీ

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:04 IST)
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ భాజపా నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి,జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి సునిల్ దేవధర్,ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు గత కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా నేతలు కేంద్రమంత్రిని కలిసి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సోము వీర్రాజు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆంధ్రులు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని కేంద్రమంత్రికి తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్యనేతలను కలిసి ఉక్కు కర్మాగారం విషయంలో ఉన్న మనోభావాలను వివరిస్తామని తెలిపారు. 
 
పురందేశ్వరి మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పలు ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. సెయిల్‌, ఎన్‌ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments