Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు.. వైకాపా సభ్యుల తీరు మారదా?

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (11:27 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం చేపట్టిన వెంటనే వైకాపా సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, వైకాపాను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. అయితే, గవర్నర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 
ఆ తర్వాత వైకాపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత కేవలం 11 నిమిషాలు మాత్రమే వారు సభలో ఉన్నారు. ఆ తర్వాత సభ నుంచి వారు బయటకు వెళ్లిపోయారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సభలో కూటమి ప్రభుత్వ సభ్యులు మినహా మరెవ్వరూ లేరు. 
 
సభకు 60 రోజుల పాటు ఎలాంటి కారణం లేదా సమాచారం లేకుండా రాకుంటే అనర్హత వేటు పడుతుందని రాజ్యాంగ నిపుణులు పదేపదే హెచ్చరికలు చేశారు. దీంతో వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారంటూ కూటమి ప్రభుత్వ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments