Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తరపున గెలిచి వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైకాపా పంచన చేసి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ కార్యాలయం నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు పంపించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అయిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్‌లు ఉన్నారు. 
 
వీరంతా గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, వైకాపా చెంతన చేరారు. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌కు లేఖ రాసి, అనర్హులుగా ప్రకటించాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కోరింది. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని, ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని, వారి వివరణ అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments