Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు... పిల్లల బతుకులు ఎలా? ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:56 IST)
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు.. పిల్లల బతుకులు ఎలా.. మేము బతికేది ఎలా..? ఏమిటీ దారుణం అంటూ కలెక్టర్‌కు ఓ లేఖ రాసి నెల్లూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఆత్మహత్యకు ముందు నెల్లూరు జిల్లా కలెక్టరు పేరిట మూడు సూసైడ్‌ నోట్‌లు రాశారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా రాక గ్రామం అభివృద్ధి చెందటం లేదని, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి బావిలోనుంచి మృతదేహాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు ఆరంభించారు. ఈ విషయం తెలిసిన జనం పెద్దసంఖ్యలో బావి వద్దకు వచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments