Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో జర్నీ కాదు.. మృత్యు ప్రయాణం ... పట్టుకుంటే ఊడివచ్చిన రోప్ క్యాబిన్

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (12:48 IST)
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. నిత్యం ఏదో ఒక అపశృతి చోటుచేసుకుంటుంది. దీంతో ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని మెట్రోలైన్‌ కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో శనివారం ఉదయం ఊహించని ఘటన ఒకటి జరిగింది. రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
మెట్రో రైలు ఎంతో సురక్షితమని ఓవైపు ప్రభుత్వంతో పాటు మెట్రో రైల్ యాజమాన్యం పదేపదే చెబుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం ప్రయాణికులను ఆశ్యర్యానికి లోనుచేస్తోంది. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో శ్లాబ్‌ పెచ్చులూడి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments