Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో జర్నీ కాదు.. మృత్యు ప్రయాణం ... పట్టుకుంటే ఊడివచ్చిన రోప్ క్యాబిన్

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (12:48 IST)
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. నిత్యం ఏదో ఒక అపశృతి చోటుచేసుకుంటుంది. దీంతో ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని మెట్రోలైన్‌ కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో శనివారం ఉదయం ఊహించని ఘటన ఒకటి జరిగింది. రైలులో నిలబడి ప్రయాణించే ప్రయాణికులకు ఆధారంగా ఉండే రోప్‌లు వేలాడే క్యాబిన్‌ పట్టుకుంటే ఊడివచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
మెట్రో రైలు ఎంతో సురక్షితమని ఓవైపు ప్రభుత్వంతో పాటు మెట్రో రైల్ యాజమాన్యం పదేపదే చెబుతున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండటం ప్రయాణికులను ఆశ్యర్యానికి లోనుచేస్తోంది. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో శ్లాబ్‌ పెచ్చులూడి మీద పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments