Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని కోసం ఆగిన మరో గుండె

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (21:52 IST)
రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన మహిళా రైతు పువ్వాడ వెంకాయమ్మ(55) గుండెపోటుతో మృతి చెందింది.

శనివారం సాయంత్రం వరకు దీక్షా శిబిరంలోనే వెంకాయమ్మ ఉన్నారు. రాజధాని కోసం నలుగురు యువకులు సెల్‌టవర్‌ ఎక్కారనే విషయం తెలుసుకున్న వెంకాయమ్మ తీవ్ర ఆందోళనకు గురైంది. తన బిడ్డలకు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందని ఆందోళన చెంది ఇంటికొచ్చి వెంకాయమ్మ కుప్పకూలిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వెంకాయమ్మ మృతితో తుళ్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని నేలపాడులో శుక్రవారం ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది.

రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 11 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 32వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments