Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని కోసం ఆగిన మరో గుండె

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (21:52 IST)
రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన మహిళా రైతు పువ్వాడ వెంకాయమ్మ(55) గుండెపోటుతో మృతి చెందింది.

శనివారం సాయంత్రం వరకు దీక్షా శిబిరంలోనే వెంకాయమ్మ ఉన్నారు. రాజధాని కోసం నలుగురు యువకులు సెల్‌టవర్‌ ఎక్కారనే విషయం తెలుసుకున్న వెంకాయమ్మ తీవ్ర ఆందోళనకు గురైంది. తన బిడ్డలకు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందని ఆందోళన చెంది ఇంటికొచ్చి వెంకాయమ్మ కుప్పకూలిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వెంకాయమ్మ మృతితో తుళ్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని నేలపాడులో శుక్రవారం ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది.

రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 11 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 32వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments