Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పొంచివున్న మరో తుఫాన్.. భయపడుతున్న రైతులు

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. దక్షిణ కోస్తా తీర జిల్లాల్లో అపార నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా రైతులను కోలుకోకుండా దెబ్బతీసింది. చేతికి వచ్చిన వంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైలుతు లబోదిబో మంటున్నారు. ఈ నష్టం నుంచి కోలుకోకముందే, ఏపీకి మరో తుఫాను గండం పొంచివుంది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 
 
దీని ప్రభావం కారణంగా వచ్చే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాను వాతావరణం నెలకొనివుందని తెలిపింది. ఇది మాల్దీవులకు సమీపంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ఫలితంగా వచ్చే ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా, దీని ప్రభావం ఎక్కువగా కేరళపై ఉంటుందని తెలిపింది. అదేసమయంలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలను దాటుకుని ఏపీకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ వైపుగా వస్తే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments