Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు వరకు పరీక్ష జరుగనుంది. పదహారు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు. 
 
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థును పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, పదో తరగతి హాల్ టిక్కెట్ చూపించి ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా పదో తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

షోటైం లో నవీన్ చంద్ర ఏం చెప్పబోతున్నాడు - రిలీజ్ డేట్ లాంచ్ చేసిన అడవి శేషు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments