Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్పీ దిగాడనీ కొట్టి చంపేశారు.. కంచిలో తెలుగు యువకుడిపై ఖాకీల దాష్టీకం

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:55 IST)
కాంచీపురంలోని శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో 40 యేళ్లకు ఒకసారి జరిగే అత్తివరదర్ ఉత్సవాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. ఈయన స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారితో సెల్ఫీ దిగాడు. దీన్ని గమనించిన విధుల్లో వుండే పోలీసులు.. ఆ యువకుడుని పట్టుకుని చితకబాదారు. దాంతో ఖాకీల దెబ్బలకు తాళలేక ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. మృతి చెందిన యువకుడి పేరు ఆకాష్. రాజమండ్రి వాసి. ఆలయంలో బంగారు బల్లిని దర్శనం తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు... ఆకాష్ సెల్ఫీ దిగడంపై ఆగ్రహిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో ఆకాష్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం మరోరకంగా స్పందిస్తున్నారు. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని చెపుతున్నారు. మృతదేహాన్ని కంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంతో వైభవంగా జరుగుతున్న అత్తి వరదర్ వేడుకల్లో అకాష్ మృతి ఆలయంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments