Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం రైలు ప్రమాదం.. నేడు రద్దు చేసిన రైళ్ల వివరాలు..

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (08:30 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదం కారణంగా సోమవారం అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇలా రద్దు చేసిన రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళతో పాటు అనేక రైలు సర్వీసులు ఉన్నాయి. 
 
సోమవారం రద్దు అయిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ - విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌, రాజమండ్రి - విశాఖపట్నం మెమూ స్పెషల్‌, విశాఖపట్నం - రాజమండ్రి మెమూ స్పెషల్‌, గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌, కోరాపుట్‌ - విశాఖపట్నం స్పెషల్‌, విశాఖపట్నం - కోరాపుట్‌ స్పెషల్‌, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - పూరీ ఎక్స్‌ప్రెస్‌, రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)లు ఉన్నాయి. 
 
మరోవైపు, రెండు రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి సంఘటన స్థలి వద్దకు వీలైనన్ని అంబులెన్స్‌లు పంపించాలని స్పష్టంచేశారు. ఘటన స్థలికి సమీపంలోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments