Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (22:41 IST)
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్‌లో భాగంగా మరో పథంక అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగినట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ఇందుకు కొత్త బస్సులు కొనడం లేదా అవసమైతే అద్దెకు తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్న విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులో ఉండాలని, ఇపుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ఆయన అధికారులను నిర్ధేశించారు. 
 
రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రతి హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. అదేసమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతి రూపాయి విలువైనదేనని ఆయన అధికారులతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments