ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (22:41 IST)
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్‌లో భాగంగా మరో పథంక అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగినట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ఇందుకు కొత్త బస్సులు కొనడం లేదా అవసమైతే అద్దెకు తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్న విద్యుత్ ఆధారిత ఏసీ బస్సులో ఉండాలని, ఇపుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ఆయన అధికారులను నిర్ధేశించారు. 
 
రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రతి హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాల్సి ఉందన్నారు. అదేసమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతి రూపాయి విలువైనదేనని ఆయన అధికారులతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments