Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీకి పోటీగా వైకాపా సర్కారు ప్రత్యేక యాప్: పేరు ఈ-నేత్ర

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల ప్రచారం ముగింది. ఈ నెల7వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫిర్యాదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది. అదేసమయంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యం ఫిర్యాదులకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ- నేత్రం పేరుతో ఆ పార్టీ యాప్‌ను విడుదల చేసింది. 
 
ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేసే సౌలభ్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.
 
ఇదిలాఉండగా ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రత్యేక యాప్‌ తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను విడుదల చేయగా.. దీనికి కౌంటర్‌గానే వైసీపీ మరో యాప్‌ రూపొందించినట్లు చర్చ నడుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments