Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీకి పోటీగా వైకాపా సర్కారు ప్రత్యేక యాప్: పేరు ఈ-నేత్ర

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల ప్రచారం ముగింది. ఈ నెల7వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫిర్యాదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది. అదేసమయంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యం ఫిర్యాదులకు వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఈ- నేత్రం పేరుతో ఆ పార్టీ యాప్‌ను విడుదల చేసింది. 
 
ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేసే సౌలభ్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.
 
ఇదిలాఉండగా ఎన్నికల ఫిర్యాదులకు వైసీపీ ప్రత్యేక యాప్‌ తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ-వాచ్‌ పేరుతో యాప్‌ను విడుదల చేయగా.. దీనికి కౌంటర్‌గానే వైసీపీ మరో యాప్‌ రూపొందించినట్లు చర్చ నడుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments